సంప్రీత్

సంప్రీత్

నా పేరు సంప్రీత్, మాది పాలమూరు. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చదివి, మూడేళ్లు లెక్చరర్‌గా పనిచేసినా, రచనపై ఉన్న ఆసక్తితో పూర్తిస్థాయిలో పుస్తకాలు రాస్తున్నాను. నేను రాసిన మొదటి పుస్తకాలు "సముద్రం దాచిన కెరటాలు", "మారని మనుషుల కథలు". ఒక కల ఆధారంగా మూడు రోజుల్లో రాసిన పుస్తకం "మహాభూమి మహాకావ్యం". తెలంగాణ మాండలికంలో రైతుకూ, మట్టికీ ఉన్న అనుబంధాన్ని కవిత్వంగా "రామయ్య పొలం" పుస్తకంలో రాశాను. అలాగే ఫిలాసఫీతో కూడిన "ఎక్స్‌పీరియన్స్ డెత్" పుస్తకం, "సీత రాసిన రామాయణం" నవల కూడా రాశాను. పుస్తకం పరిమాణం కన్నా విషయం లోతు ముఖ్యమని నమ్ముతూ నా ప్రయాణం సాగిస్తున్నాను.

సంప్రీత్ నుండి